శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.
తాత్పర్యము : ఓ మంచి బుధ్ధిగలవాడా! శ్రీరామచంద్రుని కృపచేత, సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిధ్ధమైన ధారాళమైన నీతులను, వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను.
